మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు క్లారీటీ ఇచ్చిన కత్రినా కైఫ్


బాలీవుడ్ లో అగ్ర కథానాయకిలో ఒకరు కత్రినా కైఫ్. ఇటు తెలుగులో కూడా ‘మల్లీశ్వరి,  అల్లరి పిడుగు’ సినిమాలో నటించింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘మహేష్ బాబు’ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో ‘కత్రినా కైఫ్’ హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం ‘కత్రినా కైఫ్’ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ :- ‘మహేష్ బాబు’ సినిమాలో నటించాలని ఇంత వరకు ఎవరూ నన్ను అడగా లేరు. ‘నేను మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నానని చాలా మంది అనుకుంటున్నారని నాకు తెలిసింది. నేను ‘భారత్’ సినిమా తర్వాత వేరే సినిమాలను ఇంకా ఒపుకోలేదు.  ‘భారత్’ సినిమాని రంజాన్‌ సందర్భంగా విడుదల చేస్తున్నాము.
ఈ సినిమా విడుదలైంత వరకు నేను వేరే సినిమా ఏదీ ఒప్పుకోను. ఒకవేళ సినిమా షూటింగ్ లేట్ అయ్యితే సినిమా విడుదల లేట్ అవుతుంది. అందుకే నేను వేరే సినిమాలు ఒప్పుకోవడం లేదు. నాకు సాధ్యం కాదు కూడా’ అన్ని ‘కత్రినా కైఫ్’ మీడియా ముందు తెలిపింది.
ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏప్రిల్‌ 5న విడుదల అవుతుంది…


Comments