బోర్డర్ లో సాహసం చేస్తున్న యాక్షన్ హీరో

టి. గోపీచంద్ హీరోగా తీరు దర్శకతంలో ఓ సినిమా తెరకెక్కబోతుందని సంగతి అందరికి తెలిసిందే. ఈ సోమవారంనాడు భరత్ – పాకిస్తాన్ సరిహద్దు గాల జైసల్మేర్‌ అనే గ్రామంలో మొదటి షేడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమా యాక్షన్ సీన్స్ ను ఫైట్ మాస్టర్ ‘సెల్వన్‌’ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు.

తొలి షెడ్యూల్‌ ఢిల్లీ – రాజస్థాన్ సరిహద్దులో కీలక సన్నివేశాల్ని తెరకేకించగా, అరవై రోజులు పాటూ ఇక్కడే షూటింగ్ జరుగుతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. 
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రామబ్రహ్మం సుంకర’ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కొత్తగా వైవిధమైన పాత్రలో నటిస్తున్నాడు. మేలో సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

Comments