శ్రీను వైట్ల దర్శకత్వంలో అక్కినేని వారసుడు



‘దూకుడు’ సినిమాతో స్టార్ డైరక్టర్ పేరు తెచ్చుకున్న ‘దర్శకుడు శ్రీనువైట్ల’. కొంత కాలంగా వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ‘ఆగడు’ సినిమాల నుండి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాల వరకు శ్రీనువైట్ల తీసిన సినిమాలు అన్ని ప్లాపులే.
దీంతో శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అందుకే ఆయనతో సినిమాలు చేసినందుకు మన హీరోలు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల మాత్రం అఖిల్ అక్కినేని తో ఓ సినిమా చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అఖిల్ కూడా యాక్షన్ కామెడీ ఎంటెర్టైనెర్ గా సినిమా చేయాలను కుంటున్నారట.
ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి కంబినేషన్లో సినిమా వస్తుందో లేదో, తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి….  

Comments