‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’ గా లక్ష్మీరాయ్‌

 ఖైదీ నెంబర్‌150 సినిమాలో మెగా స్టార్ ‘చిరంజీవి’తో  రత్తాలు..రత్తాలు సాంగ్‌లో మెపించిన ‘లక్ష్మీరాయ్‌’. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తుంది. కిశోర్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘లక్ష్మీరాయ్‌’ ప్రధాన పాత్రలో నటించగా, రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా తెరకెక్కిన సినిమా ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’.
ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్‌. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి, గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఈ సినిమాను సంయుతంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. హారర్‌ కామెడీ ప్రధానం చేసుకొని తెరకేకించిన ఈ సినిమాని మార్చి చివరలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఇదివరకే విడుదలైన  ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు మంచి విశేష స్పందన రాగా,  ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అతిత్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు తెలిపారు….

Comments