పాలకొల్లులో కల్యాణ మండపం కటిస్తానంటున్న స్టయిలిష్ స్టార్

‘అల్లు అర్జున్’ సంక్రాంతి సంబరాలను తన సొంత ఊరైనా పాలకొల్లులో జరుపుకుంటున్నారు. త‌మ‌ బంధువులు ‘కొప్పినీడి’ వారి ఆహ్వానం మేరకు కుటుంబ నామేతంగా పాల‌కొల్లుకు వెళ్లారు. ఈ సందర్భంగా పంచారామాలలో ఒకటైన ‘శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి’ దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. 
ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ- “మా తాతగారు పాలకొల్లు లో పుట్టారు… మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు…నేను మద్రాసు లో పుట్టాను.. ఆ తరువాత హైద్రాబాద్ లో పెరిగాను… అయితే నన్ను మీ ఊరు ఏది అంటే మాత్రం పాలకొల్లు అని మాత్రమే చెప్తాను,” అని అన్నారు. 
“పెళ్లయ్యాక మా ఆవిడ అడిగింది మీ పాలకొల్లు తీసుకెళ్లవా అని. నాకు కూడా చాలా రోజుల నుండి అందరూ హైద్రాబాద్ నుండి ఊర్లకు వెళ్తున్నారు. రోడ్లు ఖాళీ అవుతున్నాయి, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. కానీ ఈ సారి మా ఊరు పాలకొల్లు వెళ్ళాలి అనుకుని ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి రావటానికి ప్రధాన కారణం మాత్రం నా కుటుంబం. నా ఊరు పాలకొల్లు మా తాతయ్య కి నాన్నకి కొంచెం ఇచ్చింది. నాకు చాలా ఇచ్చింది. అలాంటి నా ఊరుకు ఏమైనా ఇవ్వాలి. కాదు ఇస్తూనే ఉండాలి..
అందుకే ఈ సంక్రాంతి నుండి స్టార్ట్ చేస్తున్నా… పెద్ద గుడిలో కల్యాణ మండపం కట్టిస్తా.. దానికి 10 లక్షలు డోనేషన్ ఇస్తున్నా, ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకునే ప్రయత్నం చేస్తా. అలానే ఈ ఏర్పాట్లు అన్ని చేసిన నా మిత్రుడు, ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను,” అని ఈ సందర్బంగా అల్లు అర్జున్ తెలిపారు…

Comments