1 మిలియన్ మార్క్ అందుకున్న యాత్ర ట్రైలర్

దివంగత ముఖ్యమంత్రి 'వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కిన్నసినిమా 'యాత్ర'. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టీ', ఇందులో రాజశేఖర్‌ రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'మహి వి రాఘవ్' దర్శకతం వహించగా, విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాను 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై నిర్మిస్తున్నారు.

ఎస్‌ తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు నటించగా, సబితాఇంద్ర రెడ్డి పాత్రలో మణిరత్నం భార్య సుహాసిని నటిస్తున్నారు. ఇంకా పోసాని కృష్ణమురళి,అనసూయ,రావు రమేశ్‌,వినోద్‌ కుమార్‌  ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకొన్ని సినిమాను తెరకెక్కించారు.


 ఇటీవల సోమవారం సినిమా యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 'నా విధేయతను... విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి',  'నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ, జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం'... 'మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను..కాన్ని ఇచ్చాక ఆలోచించేది ఏముంది', ‘అన్నింటికన్నా అతి పెద్ద జబ్బు క్యాన్సరో, గుండెజబ్బోకాదయ్యా.. పేదరికం.. పేదరికాన్ని మించిన శిక్షేలేదయ్యా...' అని  మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి.


చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్‌ ఆకర్షించేదిగా ఉంది. ఇప్పటికే విడుదలైనా సినిమా టీజర్‌  సాంగ్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 8న  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ సినిమా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తునారు....

Comments